ఉచిత వైద్య శిబిరానికి విశేషా స్పందన.

ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)మే23:మర్రిపెల్లిగూడెంలో అమృత హాస్పిటల్ మరియు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట వైద్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ వైద్య శిబిరానికి సుమారుగా 400 ల మంది రోగులకు  వైద్య పరీక్షలు నిర్వహించి సుమారుగా 80000 రూపాయల విలువగల మందుల ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది. ఇట్టి వైద్య శిబిరంలో సూపర్ స్పెషలిటీ వైద్యులు డా.భావనా రెడ్డి నరాల వైద్య నిపుణులు,డా.ప్రశాంత్ రెడ్డి గుండె వైద్య నిపుణులు,డా.శ్రీనివాస్ జనరల్ ఫిజిషియన్,డా.విజేత … Read more

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ధనాధన్ న్యూస్ మే23:సైదాపూర్ మండల కేంద్రం నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సైదాపూర్ ఎస్సై తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం,గురువారం తెల్లవారు జామున ఎస్సై పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా వెంకటేశ్వర్లపల్లి  గ్రామ శివారులో టీఎస్ 08 UB 3009 టాటా ఏసీ వాహనం వదిలి వెళ్ళగా వాహనాన్ని తనిఖీ చేయడంతో అందులో  26క్వింటాల రేషన్ బియ్యం ఉన్నాయని బండి నెంబర్ ఆధారంగా వల్లెపు అనిల్  … Read more

ఉపాధిహామీ కూలీలకి యోగ శిక్షణ

మహాముత్తారం(ధనాధన్ న్యూస్)మే22:మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో జాతీయ ఉపాధిహామీ కూలీలకి జాతీయ యోగ శిక్షణ అధ్యాపకుడు వావిల్ల కిష్టయ్య శిక్షణ ఇస్తూ యోగ వలన జరిగే ప్రయోజనాలను కూలీలకి వివరించడం జరిగింది.ప్రతిరోజూ ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వలన మనిషిని పట్టిపిడిస్తున్న  సైకో సోమటిక్ వ్యాధులు మానసిక వ్యాధులు భయం, కోపం,భద్రత భావము మొదలైన వ్యాధులను నయం చేయవచ్చునని,కరోన,గుండె సంబంధిత వ్యాధులు ధ్యానం తో నయం చేయవచ్చునని ఉపాధి హామీ కూలీలకి పని సామర్ధ్యమును పెంచడంతో పాటు … Read more

వెల్లి విరిసిన మత సామరస్యం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే22: లౌకికవాదం,మతసామరస్య పరిరక్షణలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శం.మరీ ముఖ్యంగా పల్లెల్లో ముస్లింలు,హిందువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. ఎవరికి కష్టం వచ్చినా.. ఒకరికొకరు అండగా ఉంటారు.హిందువుల పండుగల్లో ముస్లింలు ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటారు.హిందూ ముస్లిం భాయి భాయి  అని మరోసారి రుజువు అయింది.బుధవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ మహమ్మద్ సందాని హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.ఈ సందర్భంగా సందాని మాట్లాడుతూ … Read more

మోడల్ స్కూల్ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే22:సైదాపూర్ మండలంలోని సోమరం గ్రామంలో గల మోడల్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రధమ సంవత్సరంలో ప్రవేశాల కొరకు  పదవ తరగతి లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుండి దరఖాస్తు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ ఫర్హానా తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ మోడల్ స్కూల్ వెబ్ సైట్ ద్వారా ఎంపీసీ,బైపీసీ,సీఈసీ,ఎంఈసి,గ్రూపుల్లో ప్రవేశాల కోసం ఈనెల 25 లోపు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రవేశం పొందిన బాలికల కోసం ఉచిత హాస్టల్ సౌకర్యం కూడా ఉన్నది.పదిలో వచ్చిన … Read more

పట్టభద్రులారా తీన్మార్ మల్లన్న కి పట్టం కట్టండి

పరకాల(ధనాధన్ న్యూస్)మే 21:కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పట్టభద్రుల ఓటర్లను నాయకులు,కార్యకర్తలు స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేసి మల్లన్నను పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారము పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పరకాల పట్టణ మరియు … Read more

అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలి

కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే18:గత రెండు రోజుల నుండి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని  ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి రాజు ఒక ప్రకటనలో శనివారం  ప్రభుత్వాన్ని కోరారు.  ఈ సందర్భంగా పైడిపల్లి రాజు మాట్లాడుతూ మార్కెట్ కల్లాలలో,ఐకెపి కేంద్రాలలో  ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి పోయిందని, పండ్ల తోటలు మామిడి,సపోటా బొప్పాయి తదితర కాయలు ఈదురు గాలులకు నేలమట్టమై తీవ్ర నష్టం వాటిలిందని  ఆయన పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం  … Read more

పరకాల తిరుపతి వర్ధంతి సందర్భంగా అన్నదానం

జమ్మికుంట ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన క్రి.శే.పరకాల తిరుపతి గౌడ్ నాలుగవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు జమ్మికుంట మండలం కేంద్రంలోని స్పందన అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండల జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్  శ్యాం, సిరిసేడు మాజీ సర్పంచ్ రఫీ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వీరి చేతుల మీదుగా అనాధ పిల్లలకి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి భార్య పరకాల రేణుక,కుమారుడు సాయి కుమార్,సిరి సైడ్ మాజీ … Read more

హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయత్నం

హైదరాబాద్(ధనాధన్ న్యూస్)మే16:మండు వేసవిలో భానుడి ప్రతాపంతో నగరవాసులు నిత్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉన్నా సరే.. నిత్యం ఫ్యాన్, ఏసీ లేనిదే బతికేలా కనిపించడం లేదు.ఇక బయటకు వెళితే అంతే సంగతులు మరి.ఈ క్రమంలోనే హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా అందరిలా ఆలోచిస్తే తన ప్రత్యేకత ఏముందని అనుకున్నాడో ఏమో.. ఏకంగా తన ఆటోకు వెనక వైపు ఏసీ లాంటి కూలర్ బిగించేశాడు. ఎంచక్కా తన ప్రయాణికులను … Read more

అంగ రంగవైభవంగా ద్వితీయ వార్షికోత్సవం

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే15:జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేడుకల్లో భాగంగా మంగళవారం నాడు ఉదయం విశ్వక్ సేన ఆరాదన,పుణ్యవచనం,రక్షా బంధనం,నవ కలుష స్థపనం,మహా హోమం తో ప్రారంభమై సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ కళ్యాణ మహోత్సవం అధ్యంతం వైభవంగా,కన్నుల పండుగగా జరిగింది.రాములోరి కల్యాణానికి దాతలు పట్టు వస్త్రాలు,పూలు సమర్పించారు.అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.కళ్యాణ వేడుకతో గ్రామమంతా రామనామస్మరణతో మారూమ్రోగింది.ప్రతీ … Read more