ఘనంగా ఈటెల జమున జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మాజీ శాసన సభ్యుడు,మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సతీమణి ఈటెల జమున జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధ ఆశ్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎర్ర వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆశ్రమంలోనీ పిల్లలకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పసుపునూటి శివ,పరశురామ్,ప్రశాంత్,రాజు,అనిల్,కిరణ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

కబ్జా భూమిపై ఆఫీసర్ల సర్వే

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలో ఉన్న సర్వే నం.467లో గల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించిన ఘటనపై అధికారులు కదిలారు.శుక్రవారం జమ్మికుంట తహశీల్దారు జి.రమేష్ బాబు ఆధ్వర్యంలో డివిజన్ డీఐ ఫయాక్ అలీ జమ్మికుంట సర్వేయర్ మనోజ్‌తో పాటు పలువురు సిబ్బంది స్థలాన్ని సర్వే చేయడానికి వెళ్లారు.గత కొద్దిరోజులుగా వివిధ దినపత్రికల్లో వస్తున్న వార్తలతో పాటు పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త గుర్రపు మహేందర్‌గౌడ్ తహశీల్దార్‌కు ఈ … Read more

మండల అధికారులతో ఆర్డీవో సమీక్ష సమావేశం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రోజున మధ్యాహ్నం ఎస్ రమేష్ హుజురాబాద్ ఆర్డీవో మరియు మండల ప్రత్యేక అధికారి బి.శ్రీనివాస్ మండలంలోని వివిధ అభివృద్ధి పనులపై మరియు గ్రామ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం మండల స్థాయి అధికారులు,గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు అంగన్వాడి టీచర్స్ , ఏఎన్ఎంమ్ ,సూపర్ వైజర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాల మేరకు గ్రామాలలో ఉన్న సమస్యలను పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంమ్,ఏడబ్ల్యుటి లను గ్రామాల వారీగా … Read more

న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: జనగామ పట్టణంలో న్యాయవాద దంపతులపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హుజురాబాద్ కోర్టు ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని,న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ గురు,శుక్రవారాలు న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియన్ ప్రధాన … Read more

ఇండియన్ యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్ష బరిలో బుడిగె శ్రీకాంత్

బోడిగే శ్రీకాంత్ జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగబోతున్న సందర్భంగా,జమ్మికుంట మండల మరియు పట్టణానికి చెందిన విద్యార్థిని విద్యార్థుల, యువతి యువకుల మద్దతుతో జమ్మికుంట అధ్యక్ష బరిలో నిలిచినట్టు తెలిపారు. తాను గతంలో విద్యార్థి నాయకునిగా, విద్యార్థుల సమస్యల పట్ల తలపెట్టిన ప్రతీ కార్యక్రమంలో పాల్గొని,నాటి నుంచి నేటి వరకు ఎంతైతే బాధ్యతతో పనిచేస్తున్నానో అంతే అంకుటిత దీక్షతో యువతి యువకుల … Read more

మోడల్ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం సోమవారం  మోడల్ స్కూల్  లో బుదవారం రోజున అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్ డిఎస్) అధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఉమ్మడి జిల్లా  ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ సభ్యత్వం నమోదు చేయించారు, అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ వర్షాకాల సమయంలో వర్షాలు భారీగా కురిస్తే క్లాస్ రూమ్ లోకి వర్షపు నీరు వస్తుందని,పాములు,తేళ్లు కప్పలు స్కూల్ లోపలికి వస్తూన్నాయని,చుట్టుపక్కల గడ్డి బాగా పెరిగిందని,రాత్రి సమయంలో గర్ల్స్ హాస్టల్లో చీకటిగా ఉందని స్కూల్ … Read more

విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్చదనం పచ్చదనము కార్యక్రమాన్ని రెండవ రోజు కళాశాల ప్రిన్సిపాల్ మహేందర్ కుమార్  అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కరీంనగర్ ఇంటర్మీడియట్ విద్య అధికారి (డిఐఈఓ) జగన్మోహన్ రెడ్డి హాజరై కళాశాలలో మొక్కలు నాటినా తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86వ జయంతి సందర్బంగా పూలమాలవేసి నివాళి అందించాడు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఐఈఓ మాట్లాడుతూ విద్యార్థులు కళాశాల మొక్కలు నాటడముతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత … Read more

నూతన మార్కెట్ కార్యదర్శి మల్లేశంకు సహకరిస్తాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా బదిలీపై వచ్చిన ఆర్. మల్లేశంకు సంపూర్ణంగా సహకరిస్తామని జమ్మికుంట అడ్తిదారుల సంఘం, దాడ్వాయిల  సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘం భవనంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న గుగులోతు రెడ్యా నాయక్ కు వీడ్కోలు పలుకుతూ.. నూతన కార్యదర్శి మల్లేశంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ సెక్రటరీగా సమస్తవంతంగా రెడ్డి నాయక్ పని చేశారని … Read more

న్యాయం కోసం సహారా ఏజెంట్లు ఎదురుచూపు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తమకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సహారా ఇండియా ఏజెంట్లు,ఖాతాదారులు కోరారు. జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో మంగళవారం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వెంటనే తమ డిపాజిట్‌ సొమ్ము చెల్లించాలన్నారు. సహారా సంస్థలో కోట్లాది మంది పెట్టుబడులు పెట్టారని,సుప్రీంకోర్టు వడ్డీతో సహా బాధితులకు వారి డిపాజిట్‌ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమని విమర్శించారు. … Read more

అనాధ శరణాలయంలో రాజేష్ ఠాకూర్ జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంట లోని స్థానిక స్పందన అనాధాశ్రమంలో పిల్లలతో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం జరిగింది.అనంతరం పిల్లలకు స్వీట్స్ పంపిణి చేయడం జరిగింది.రాజేష్ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ లో ఉంటూ ప్రజలకు సేవ చేయడం ప్రజలకోసం పోరాటాలు చేయడం,తన తండ్రి సీనియర్ నాయకులు దివంగత రవి ఠాకూర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రస్తుతం పార్టీలో జిల్లా స్థాయిలో ఉండడం వారి … Read more