విద్యా విధానంలో మార్పుతోనే యువతకు ఉపాధి

కరీంనగర్ టౌన్/ధనాధన్ న్యూస్,అక్టోబర్ 6: ప్రస్తుత విద్యా విధానం మార్పుతోనే యువతకు ఉపాధి లభిస్తుందని బి.ఎన్.రావు ఫౌండేషన్ అధ్యక్షుడు, డాక్టర్ బి.యన్ రావు అన్నారు. ప్రస్తుత విద్యా విధానం- నిరుద్యోగ సమస్య అనే అంశంపై ఫిలిం భవన్ లో ఆదివారం నిర్వహించిన చర్చ గోష్టిలో పలువురు వక్తలు మాట్లాడారు. మనదేశంలో ప్రస్తుత విద్యా విధానం కేవలం పాస్ మార్కుల మీదనే కేంద్రీకృతమై ఉందని వివరించారు. నాణ్యమైన విద్యను పొందాలంటే సాంప్రదాయ విద్యకు స్వస్తి పలకాలని వివరించారు. సమకాలీన … Read more

గుండె పోటుకి గురై ఆర్టీసీ డ్రైవర్ మృతి

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం దుద్దేనపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ రమేష్ సింగ్ తండ్రి రాధా కిషన్ సింగ్ వయస్సు 46,ఆదివారం రోజున విధి నిర్వహణలో భాగంగా హుజరాబాద్ ఆర్టీసీ డిపో నుండి ఉదయం హైదరాబాద్ వెళ్తుండగా మార్గం మధ్యలో గుండె పోటు రావడంతో,బస్సులో ఉన్న ప్రయాణికులు హాస్పిటల్స్ లో తరలించారు,చికిత్స పొందుతూ మృతి చెందాడు,ఆయనకు భార్య మంజుల,ముగ్గురు కుమార్తెలు అర్చన,అఖిల,అన్విత ఉన్నారు.ఆయన మృతి పట్ల  కుటుంబ సభ్యులు బోరున విలపించారు.ఆర్టీసీ ఉద్యోగులు,గ్రామ ప్రజలు,సంతాపం తెలిపారు.ఆయన కుటుంబానికి … Read more

బుడగ జంగాల కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: మాట ఇవ్వడమే కాదు దాన్ని నిలబెట్టుకున్నప్పుడే నిజమైన లీడర్ అవుతాడని నానుడి.దానికి తగ్గట్టుగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గతంలో హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లోని బేడ బుడగ జంగాల కాలనీకి వెళ్లినప్పుడు అక్కడ నివసించే ప్రజలు మా కాలనీ యొక్క అవస్థలు చూడమని ప్రణవ్ కు తెలుపగా స్పందించిన ప్రణవ్ త్వరలోనే మీ కాలనీకి తగిన సాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది.ఇచ్చిన మాట ప్రకారం బుధవారం రోజున ఆ కాలనీలో … Read more

ప్రభుత్వాస్పత్రికి వాటర్ డిస్పెన్సర్ ను అందించిన ముశం శ్రీనివాస్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నప్పటికీ ప్రజలకు ప్రభుత్వాస్పత్రి సేవలపై  నమ్మకం కలిగించేందుకు రాంపూర్ గ్రామానికి చెందిన ముషం శ్రీనివాస్ తన భార్య ప్రత్యూషను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి డెవలరీ చేయించిన ఆలోచన గొప్పదని ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవో సుధాకర్ రావు కొనియాడారు. కాగా ముషం శ్రీనివాస్ తనకు పాప జన్మించిన సందర్భంగా ప్రభుత్వాస్పత్రికి తన వంతు సాయం అందించాలనే సంకల్పంతో బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని సుమారు 10వేల విలువ చేసే వోల్టాస్ వాటర్ … Read more

డ్రోన్ స్పేయర్ కు యువకులకు రుణ సదుపాయం

సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి లో సోమవారం రోజున విశాల సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో  అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించినట్లయితే రైతులకు ఆర్థిక భారం తగ్గి సంఘ అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని, ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో డ్రోన్ స్పేయర్ అవసరం అవుతుంది గ్రామంలో రైతులు పండించే వరి మొక్కజొన్న పత్తి పంటలకు చీడపీడల నివారణ కోసం పిచికారి చేసేందుకు … Read more

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు జన్మదిన వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ అవరణలో బారాస అధ్యక్షులు సోమరపు రాజయ్య ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు జన్మదిన వేడుకలను మరియు మండలం కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కేక్ కట్ చేసిన తరువాత నాయకులూ కార్యకర్తలు స్వీట్ పంపిణి చేశారు.వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు.సతీష్ బాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని … Read more

నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటా:ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్ సెప్టెంబర్ 25:  హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజల ఏవైనా సమస్యలు వచ్చినప్పుడూ తాను ఎప్పుడు అండగా ఉంటానని, వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. “నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుంటే నేరుగా నన్ను సంప్రదించండి. నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం అందుబాటులో ఉండటం నా … Read more

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్ రావు 93వ జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల రాజేశ్వర్ రావు విగ్రహానికి  వారి కుమారులు కిషన్ రావు,శ్రీనివాస రావు,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు,కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.పేదల పక్షాన నిలబడి వారికి కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశాడని,గల్లి నుండి ఢిల్లీ వరకు … Read more

యశ్వంత్ మృతి అత్యంత బాధాకరం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇంటర్ విద్యార్థి విద్యుద్ఘాతంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ తెలిపారు. శనివారం ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనతో ఊరంతా విషాదచాయలు నెలకొన్నాయని పేర్కొన్నారు.ఈ దుర్ఘటనపైన చింతిస్తూ,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వెంకట్ తెలిపారు.ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాల్లో నవరాత్రుల కోసం మండపాల అలంకరణ,నిమజ్జనం సమయాల్లో నిర్వాహకులు తగు జాగ్రత్తలు … Read more

అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు ఘనంగా శ్రీమంతం

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో శుక్రవారం రోజున అంగన్వాడీ కేంద్రంలో  శుక్రవారం సభ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అన్నప్రాసన,అక్షరాభ్యాసం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీవో ఎండీ బషీరొదిన్ మాట్లాడుతూ గర్భవతులు  క్రమం తప్పకుండా అంగన్వాడి నుంచి పంపిణీ చేస్తున్న  పాలు,గుండ్లు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమం అనంతరం డ్రై డే ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి … Read more