వీణవంక మండలంలో కాంగ్రెస్ ప్రచార జోరు!

వీణవంక/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూసుకుపోతోంది. శనివారం రోజున బేతిగల్, కనపర్తి, వల్భాపూర్, నర్సింగాపూర్, కిష్టం పేట, గంగారం, చల్లురు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, బాణాసంచా కాల్పులతో కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, గ్రామాల్లోని సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను … Read more

ప్రభుత్వ విద్యార్థుల విజ్ఞాన విహార యాత్రల కోసం స్పెషల్ బస్సులు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలకు మరియు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలకు అతి తక్కువ ఖర్చుతో టీజిస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని సూపర్ లగ్జరీ ఎక్స్ ప్రెస్ మరియు పల్లె వెలుగు వంటి బస్సులు కెపాసిటీ బట్టి వినియోగించుకోవచ్చు.ఈ అవకాశాన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వినియోగం చేసుకోవాలని,ఆర్టీసీ బస్ లో ప్రయాణం సురక్షితం అని హుజూరాబాద్ … Read more

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ నియోజకవర్గం లోని రైతు వేదికలు సంబరాలకు ముస్తాబవుతున్నాయని,ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని,రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  వోడితల ప్రణవ్ అన్నారు.గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు,రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ … Read more

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి

సైదాపూర్ మండలం దుదేనపల్లి గ్రామంలోని  పెద్దమ్మ తల్లి దేవస్థానంలోని గుడి చుట్టూ సిసి రోడ్ పనులను బుధవారం రోజున ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి గుండారపు శ్రీనివాస్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో దుదేదనపల్లి గ్రామ ఎంపీటీసీ చాడ చైతన్య మరియు గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి చిన్న వెంకటేశం,కాంగ్రెస్ కార్యకర్తలు,ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముదిరాజ్ కులస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

విద్యా ఉపాధి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలి

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని,రాష్ట్రం లో వెంటనే మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జన సమితి మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు రాగులపెల్లి లక్ష్మి డిమాండ్ చేశారు.మహిళా జన సమితి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన మహిళా సదస్సులో వారు మాట్లాడుతూ  దేశంలో,రాష్ట్రంలో ఇంకా మహిళలు రెండవరకం పౌరులుగానే చూడబడుతున్నారని,సమాన పనికి సమాన వేతనం ఇంకా పొందలేకపోతున్నారని తెలిపారు. ఎన్నికల సమయాల్లో మహిళను మహారాణులను చేస్తామంటూ ఉదార … Read more

పచ్చదనం పరిశుభ్రత,మానవ సంబంధాలపై అవగాహన కల్పించాలి

ఎన్ఎస్ఎస్  వాలంటీర్లు ప్రజలకు పచ్చదనం పరిశుభ్రత  మానవ సంబంధాల అభివృద్ధిపై అవగాహన కల్పించాలని సైదాపూర్ ఎంపీపీ , ఎంపీటీసీల  పోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పిలుపునిచ్చారు.సోమవారం రోజున మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో సింగపూర్ లోని వీఎస్ఆర్  డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వేసవికాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ఎన్ఎస్ఎస్  వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజాన్ని రక్షించేది సమాజాన్ని చైతన్యవంతుల్ని చేసే బాధ్యత ( … Read more

మంత్రి పొన్నంని సన్మానించిన దేశిని కోటి

కరీంనగర్ లోని వి కన్వెన్షన్ హాల్ లో ఆదివారం జరిగిన గౌడ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్న-కోటి గజామాలతో శాల్వతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేశిని కోటిని మంత్రి దగ్గరికి తీసుకోని గుండెలకు హత్తుకున్నారు.నాటి నుండి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో తడక శ్రీకాంత్,నేరెళ్ళ మహేందర్ గౌడ్,బొంగొని వీరన్న,దేశిని సదానందం,శ్రీపతి నరేష్,పైడిపల్లి ఆనందం,రామ్మూర్తి,బుర్ర సంపత్,అయోధ్య గౌడ్,  సదానందం,రమేష్,తదితరులు పాల్గొన్నారు

మహాశివరాత్రి రుద్రహోమంలో పాల్గొన్న వొడితల ప్రణవ్

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు,రుద్ర హోమం,రాత్రి శివపార్వతుల కల్యాణం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ని ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రుద్ర హోమం చేశారు.. ఆలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు వొడితల … Read more

గంగిరెద్దుల భవనానికి భూమి పూజ

హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామంలో మొట్టమొదటి సంచార జాతి అయిన గంగిరెద్దుల కులస్తుల కొరకు 10 లక్షల రూపాయల నిధులతో కమిటీ హాల్ నిర్మించడం జరుగుతుందని ఇందిరానగర్ మాజీ కోడిగూటి శారద ప్రవీణ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో మొట్టమొదటిసారిగా ఒక సంచార జాతి గంగిరెద్దుల కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించడం తెలంగాణలోనే మొట్టమొదటిగా చెప్పుకోవచ్చని వారు తెలిపారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ శుభకార్యానికి … Read more

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారని ఈ తరుణంలో మహిళా లోకం మరింత … Read more