తీన్మార్ మల్లన్నకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ప్రజాగళం,ప్రజాకలం క్యూ  న్యూస్ అధినేత జర్నలిస్ట్ గా తీన్మార్ మల్లన్న,రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలు ఎండగడుతూ ఎక్కడ అవినీతి అన్యాయం జరిగిన ప్రజలకు తన క్యూ న్యూస్ ఛానల్ మరియు శరణార్థి తెలంగాణ పత్రిక ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు తెలియపరుస్తూ ప్రజల కు వారధిగా నిలుస్తూ ఎన్నో రకాల సేవలందించారని బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేదాక నిరంతరం శ్రమించాడని కాంగ్రెస్ ప్రభుత్వం … Read more

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలకేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు సమావేశ మందిరంలో మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ దొడ్డే మమత ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ ఎంపీపీ తిరుపతిరావు,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల కాలంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు … Read more

వైద్య విద్యకు పేద విద్యార్థులను దూరం చేసే కుట్ర

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన నీట్ పేపర్ లీకేజీ పై బిఆర్ఎస్వి జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం బిఆర్ఎస్వి నాయకులు కొమ్ము నరేష్,హరీష్ వర్మ అప్పని మాట్లాడుతూ 24 లక్షల వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు.గత 20 రోజులుగా విద్యార్థులు,విద్యార్థి తల్లిదండ్రులు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసిన నిమ్మకునీరెత్తనట్లుగా రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.ఈ రాష్ట్రంలో 70 వేల … Read more

కౌశిక్ రెడ్డిని విమర్శించే స్థాయి ప్రణవ్ ది కాదు

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్13: హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ని విమర్శించే స్థాయి ప్రణవ్ కి లేదని బీఆర్ఎస్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి అన్నారు. గురువారం హుజరాబాద్ లోని ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వారం రోజులుగా ఫ్లై యాష్ స్కాం గురించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి కనుసన్నలోనే స్కామ్ జరుగుతుంది అని ఆధారలతో నిరూపిస్తే ఇప్పటివరకు మంత్రి ఎందుకు స్పందించడం లేదని … Read more

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్12:ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అందుకోసం ప్రభుత్వాలు సకల సౌకర్యాలు అందిస్తున్నట్లు ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.విద్యా సంవత్సరం ప్రారంభ రోజును పురస్కరించుకుని మండల కేంద్రంలోని వెన్కెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫాం లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ఆది నుండి నేటి … Read more

రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్లు స్కామ్

హుజురాబాద్(ధనాధన్ న్యూస్)జూన్08:రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.శనివారం వే బిల్లు లేకుండా  అధిక లోడ్ రూల్ ప్రకారం 32 టన్నులతో పోవాల్సిన లారీలు 80 టన్నుల లోడ్ తో వెళ్తున్న ఫ్లై యాష్ లారీలను  అడ్డుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.రోజుకి రెండు మూడు వందల ఫ్లై యాష్ లారీలు రామగుండం ఎన్.టి.పి.సి నుంచి ఖమ్మం వైపు … Read more

తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన సాగుతుంది

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే30:జమ్మికుంట పట్టణంలోని జెడ్పిటిసి కార్యాలయంలో పత్రిక సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేక కొనసాగుతుందని, ఈ సందర్భంగా జమ్మికుంట జడ్పిటిసి డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ పాలన ప్రజలకు ఎంతగానో మేలు చేసిందని భావించిన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పాలన మొండి చేయి చూసిందని వారు గుర్తు చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలల గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూపొందించిన.ఏ ఒక్క అంశం కార్యచరణ … Read more

కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ

సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే29:సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన  బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త పిన్ రెడ్డి రాంరెడ్డి  మరణించగా భారత రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును నామినీ గా ఉన్న ఆయన భార్య పద్మ కుటుంబసభ్యుల సమక్షంలో మాజీ  ఎమ్మెల్యే సతీష్ కుమార్  అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ  భారత రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్తగా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు … Read more

ఖబర్దార్ కేటీఆర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే25:మొన్న డిసెంబర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినప్పటికీ ఇంకా అహం తగ్గలేదని, వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్నను చూసి ఓర్వలేక ” మీకు బిట్స్ పిలానీ కావాలా.. పల్లి బఠాణి కావాలా..! అంటూ మల్లన్నను ఉద్దేశించి హేళన చేస్తూ మాట్లాడిన కేటీఆర్ ఒళ్ళు … Read more

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వీణవంక(ధనాధన్ న్యూస్)మే13:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం లోని సొంత గ్రామం వీణవంక లోని ప్రభుత్వ పాఠశాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, భార్య శాలిని తోపాటు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌశిక్ రెడ్డి తల్లిదండ్రులు సాయినాథరెడ్డి,శైలజ సోదరుడు కార్తీక్ రెడ్డి ,సంతోషిని దంపతులు ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును … Read more