రాములోరి దేవాలయానికి కూల్ వాటర్ డిస్పెన్సర్ బహుకరణ

అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి ఎల్ఐసి (జీవిత బీమా సంస్థ) ఆధ్వర్యంలో రూ 50 వేల విలువగల బ్లూ స్టార్ కూల్ వాటర్ డిస్పెన్సర్ ను విరాళంగా బహుకరించారు. అదేవిధంగా శనివారం ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ మండపంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా  కరీంనగర్ డివిజనల్ ఆఫీసు  వారు  తోడు నీడ అనే కాంపిటీషన్ నిర్వహించి  విజేతలకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  కరీంనగర్ ఆదిలాబాద్  … Read more

ఘనంగా తల్లిపాల దినోత్సవం

వీణవంక/ధనాధన్ న్యూస్:వీణవంక  మండలంలోని అంగన్వాడి కేంద్రంలో మండల సెక్టార్ ఇంచార్జ్ శ్యామలదేవి ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ ఒరేం శ్రావణి తల్లిపాల దినోత్సవాల్లో భాగంగా పిల్లలకు అన్నప్రాసన  కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలే పిల్లలకు ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ పుట్టిన పాపకు తల్లిపాలనే తాగించాలని అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గౌడ కులస్తులు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.వృత్తి రీత్యా తాడిచెట్లు ఎక్కి జీవనం సాగించే గౌడ కులస్తులు నిత్యం ప్రమాదాలు జరగడం కొంత బాధ కలిగిస్తుందని,ఇటీవల జమ్మికుంట మండల పరిధిలోని మడిపల్లి గ్రామంలో మాచర్ల నాగేశ్వర్ గౌడ్ మృతి తీవ్ర బాధను కలిగించిందని,వారికి అండగా నిలవాలని సర్వాయి పాపన్న గీత కార్మిక … Read more

నిరుపేదల నివేషణ స్థలంలో డంపింగ్ యార్డ్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ 275,76,77,78 లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 300 నిరుపేద కుటుంబాలకు నివేషణ స్థలం మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది.ఈ స్థలాలలో  కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టారు.స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయిలలో జీవనం కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉండగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివేషణ స్థలాలను … Read more

నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే … Read more

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 13వ వర్థంతి

రాజకీయ దురంధరుడు,స్నేహశీలి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు ఆశలను కొనసాగించడమే తన లక్ష్యమని,వారసత్వంగా వచ్చిన ప్రజల ప్రేమాభిమానలు పొంది వారికి సేవ చేస్తాననీ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 13వ వర్ధంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు,మానకొండూర్ మాజీ శాసన సభ్యుడు ఆరపల్లి మోహన్ పాల్గొన్నారు.ఈ … Read more

వరద బాధితులను ఓదార్చిన వోడితల ప్రణవ్

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని 23వ వార్డు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది.ఈ కాలనీలో దాదాపు 300 మంది బుడగ జంగాల ప్రజలు,పిల్లాపాపలతో గుడిసెలు వేసుకుని అనేక సంవత్సరాల నుండి నిరుపేద జీవితాలను గడుపుతున్నారు.నిన్న మొన్నటి భారీ వర్షాల వల్ల అనేక గుడిసెలపై గల తాత్కాలిక పైకప్పులు కొట్టుకుపోగా దాదాపు మొత్తం గుడిసెలు సగం నీటిలో కూరుకుపోవడంతో వస్తువులు, దుస్తులు,పక్క బట్టలు,రేషన్ బియ్యం ఇతర … Read more

క్రీ.శే.బెజగం చంద్రమౌళి చూపు సజీవం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి నివాసి అయిన బెజగం చంద్రమౌళి ఈ నెల 21 రోజున రాత్రి మృతి చెందడం జరిగింది.సదాశయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నరహరి  నేత్రదానంపై అవగాహన కల్పించగా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో, వరంగల్  ఎల్వీపీ టెక్నీషియన్ నరేందర్ సహకారంతో నేత్ర సేకరణ చేసి హైదరాబాద్ ఎల్వీపీ ఐ బ్యాంక్ కి పంపడం జరిగింది.ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన  కుమారుడు కోడలు బెజగం రమేష్,జ్యోతి లకు,కూతుర్లు అల్లుండ్లు రజిత,సుధాకర్ … Read more

రైతు ఋణమాఫి పట్ల యువజన కాంగ్రెస్ సంబరాలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు బ్యాండు భాజాలతో, టపాసులు కాల్చి మిఠాయిలు పంచినృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు  మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కరీంనగర్ జిల్లా రైతుల పక్షాన మరియు యువజన కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు.రైతు రుణ మాఫీకి కృషిచేసిన … Read more

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ నియోజకవర్గం లోని రైతు వేదికలు సంబరాలకు ముస్తాబవుతున్నాయని,ఇచ్చిన హామీలను నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని,రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  వోడితల ప్రణవ్ అన్నారు.గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేస్తున్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లోని రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు,రైతు వేదికలను ముస్తాబు చేస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ … Read more