రైతులెవరు అధైర్య పడవద్దు

హుజురాబాద్,ధనాధన్ న్యూస్: కమలాపూర్  మండలాల గ్రామాల రైతులకు సాగునీరు  కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని,రైతులకు సాగు పంటలకు సరిపడే నీళ్లు అందించేందుకు ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఇంచార్జి ఒడితేల ప్రణవ్ ని కోరారు.కమలాపూర్ మండలం లోని శనిగరం,లక్ష్మీపురం,గుంటూరు పల్లి గ్రామాలకు చెందిన రైతులు తమ పంట పొలాలకు ఎస్ ఆర్.ఎస్.పి.కెనాల్ ద్వారా సాగునీళ్లు అందడం లేదని శనివారం రోజున హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ … Read more

ఘనంగా శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మల గుడి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వేద పండితుల మధ్య మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయం గా వైభవంగా ఆలయ అర్చకులు వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. శనివారం 85 వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఆలయ ట్రస్టిలు కొండూరు కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.భక్తులు స్వామి వారి కళ్యాణం మహోత్సవమ్ నేత్రపర్వంగా వీక్షించి మొక్కులు … Read more

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఉడిగే రాజశేఖర్

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన కోడం పద్మ(50)  కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం మణికంఠ మాడ్రన్ రైస్ మిల్ ఉడిగే విజయ రాజశేఖర్  50 కిలోల బియ్యం సహాయం అందించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లవేళలా  ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రకాష్,సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్, చంద్రమోహన్ పాల్గొన్నారు.

పెండింగ్ ఫీజ్ బకాయిలను వెంటనే చెల్లించాలి

కామారెడ్డి,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3 సంవత్సరాల కు సంబంధించిన ఇంజనీరింగ్ డిగ్రీ బి.ఎడ్ ప్రొఫెషనల్ కళాశాలకు సంబంధించిన 5500 కోట్ల పెండింగ్ ఫీజు బకాయాలను విడుదల చేయాలని కోరుతూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో 2000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ,నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం … Read more

తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి జమ్మికుంట మండల అధ్యక్షుడిగా అనిల్ కొలుగూరి

జమ్మికుంట,ధనాధన్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు వికాస సమితి (రి.1251/2016) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు యర్రమాద కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు జమ్మికుంట మండల అధ్యక్షులుగా కొలుగూరి అనిల్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఆశయాలను ఆదర్శాలను మండల వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి,చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు.సమాజంలో జరుగుతున్న అవినీతిని అక్రమాలను వెలికి తీసేందుకు సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధమని తెలిపారు.(సహవిస) జమ్మికుంట మండల అధ్యక్షుడిగా … Read more

కరీంనగర్ ను కరప్షన్,కలెక్షన్ కు కేరాఫ్ గా మార్చారు

కరీంనగర్,ధనాధన్ న్యూస్: కళకళలాడే కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ పుణ్యమాని, అవినీతి,అక్రమాలకు నిలయంగా,కరప్షన్ కలెక్షన్ కు కేరాఫ్ గా మారిందని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.2014 నుంచి నిన్నటి వరకు జరిగిన భూమాఫియా ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా గుట్కా మాఫియా మట్కా మాఫియా జట్కా మాఫియా నడిపింది,బిఆర్ఎస్ నేత లేనని వీరందరూ … Read more

ఎలాగందుల ఎంపీ స్థానం హస్తగతం అయ్యేనా?

ఎడిటర్ డెస్క్,ధనాధన్ న్యూస్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తమవుతోంది.ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం గురించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కరీంనగర్ నే టార్గెట్ చేస్తున్నాయి. కాగా, ఈ సారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం తప్పనిసరిగా కాంగ్రెస్ ఖాతాలోనే నమోదయ్యే విధంగా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థిని బరిలో దింపితే గెలుపు అవకాశాలు తప్పనిసరిగా ఎక్కువగానే … Read more

పేద మహిళలను లక్పతీ దీదీలుగా తయారు చేయాలి

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలోని సంతోషిమాత మండల సమాఖ్య కార్యాలయం లో మంగళవారం రోజున సెర్ప్ సిబ్బంది వివోఏలకు లక్పతి దీదీ కార్యక్రమంపై డిపిఎం వంగ రవిందర్,ఎపిఎంలు తిరుపతి,కుమారస్వామిలు శిక్షణ ఇచ్చారు.శిక్షణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామైఖ్య సంఘం పరిదిలో ఎనభై మంది మహిళలను గుర్తించి వారిని ఫెసిలిటేట్ చేస్తూ ట్రబుల్ షూటర్ గా,నైపుణ్యాలు కల్పించి పర్యవేక్షణ చేసే భాధ్యత రిసోర్స్ పర్సన్స్  చూడాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ ఉపాధి అవకాశాలు … Read more

శివాజీ ఉత్సవ కమిటీ ఉన్నట్టా లేనట్టా

సైదాపూర్,ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో గత సంవత్సరంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేతుల మీదుగా ఆకునూరు గ్రామంలో శివాజీ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్,స్వామి వివేకానంద,చత్రపతి శివాజీ విగ్రహాలను అన్నదానాలతో అంగరంగ వైభవంగా  ఆవిష్కరించారు.అంతవరకు బాగానే ఉన్నా,ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించిన తరువాత మొదట వచ్చిన జయంతి ఉత్సవాలను సోమవారం రోజున ఎవరు నిర్వహించలేదు.అందుకు గల కారణాలు ఏమైనా ఉత్సవ నిర్వహణ చేయకపోవడం మాత్రం గ్రామ ప్రజలను ద్రిగ్బంతికి గురిచేసింది.కనీసం వచ్చే … Read more

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్: ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇంచార్జీ వొడితల ప్రజలకు సూచించారు. ఆదివారం ఇళ్ళందకుంట మండలం రాచపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జమ్మికుంట పట్టణానికి చెందిన సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని … Read more