పట్టభద్రులారా తీన్మార్ మల్లన్న కి పట్టం కట్టండి

పరకాల(ధనాధన్ న్యూస్)మే 21:కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పట్టభద్రుల ఓటర్లను నాయకులు,కార్యకర్తలు స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేసి మల్లన్నను పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల నియోజకవర్గ కోఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పిలుపునిచ్చారు.మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారము పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కో-ఆర్డినేటర్ వొడితల ప్రణవ్ పరకాల పట్టణ మరియు … Read more

హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయత్నం

హైదరాబాద్(ధనాధన్ న్యూస్)మే16:మండు వేసవిలో భానుడి ప్రతాపంతో నగరవాసులు నిత్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉన్నా సరే.. నిత్యం ఫ్యాన్, ఏసీ లేనిదే బతికేలా కనిపించడం లేదు.ఇక బయటకు వెళితే అంతే సంగతులు మరి.ఈ క్రమంలోనే హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా అందరిలా ఆలోచిస్తే తన ప్రత్యేకత ఏముందని అనుకున్నాడో ఏమో.. ఏకంగా తన ఆటోకు వెనక వైపు ఏసీ లాంటి కూలర్ బిగించేశాడు. ఎంచక్కా తన ప్రయాణికులను … Read more

తెలంగాణ జన సమితి
పార్లమెంటరీ కమిటీ నియామకం

పార్లమెంటరీ ఇంచార్జి ముక్కెర రాజు పార్లమెంటరీ కో ఆర్డినేటర్ అరికిల్ల స్రవంతి కరీంనగర్(ధనాధన్ న్యూస్)మే 06:పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జన సమితి పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. కరీంనగర్ పార్లమెంటరీ కమిటీ ఇంచార్జి గా ముక్కెర రాజు,కో ఆర్డినేటర్ గా జగ్గారెడ్డి,అరికిల్ల స్రవంతి, కర్రే సతీష్ యాదవ్,మోరే గణేష్,పల్లెర్ల శ్రీనివాస్,రమేష్ లను నియమించడం జరిగింది.తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ తో పొత్తు లో భాగంగా ప్రస్తుతం … Read more

అవినీతి పోవాలంటే- సామాన్యుడు మారాలి   

న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)మే03:నేటి సమాజ పరిస్థితి ఎలా తయారయింది అంటే..! మనం మారద్దు కానీ మార్పు రావాలి, అవినీతి లేని సమాజం కావాలి, ప్రభుత్వాల ద్వారా ఉచితాలు రావాలి, మనం ఏం పని చేయొద్దు, మన ఇంటి వద్దకే అన్ని రావాలి, కానీ ఓటు వేసేటప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే మా ఓటు… మరి డబ్బులు తీసుకొని ఓటు వేసినప్పుడు మనం కోరుకునే అవినీతి రహిత సమాజం ఎలా ఏర్పడుతుంది. ఎవరో రావాలి ఏదో … Read more

పోలీసులకు పుష్ప 3 సినిమా ట్రైలర్ చూపించిన జాదుగాడు

ఖమ్మం(ధనాధన్ న్యూస్)మే 01:పోలీసుల కళ్లుగప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్తకొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు లీడర్లు. అలాంటి చావు తెలివి తేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు.అది కూడా పుష్ప మూవీ తరహాలో కానీ,పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు.ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు 15లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు.ముందు పోలీసులకు అనుమానమే రాలేదు.కానీ,కొంచెం తేడాగా ఉండటంతో అతడ్ని తనిఖీ చేశారు.అంతే,కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.ముందు,ప్యాంట్‌ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని బయటికి తీశాడు.ఆ తర్వాత … Read more

తెలంగాణ కు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 30:దేవుడు గుడిలో ఉండాలి ,భక్తి గుండెల్లో ఉండాలి అంతేకానీ రాముని పేరు చెప్పుకొని హిందూ సాంప్రదాయానికి మాయని కి మచ్చలు వచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారని ,అయోధ్య రామాలయం పూర్తికాకముందే రాములోరి అక్షింతలను 15 రోజుల ముందు పంపిణీ చేసి హిందూ సాంప్రదాయాలను మంటగలిపిన ఘన చరిత్ర ప్రధాని మోడీకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.మంగళవారం రోజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ … Read more

మల్కాజ్గిరి పై..ఆధిపత్యం ఎవరిది.?

హైదరాబాద్ (ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 20:మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియానే! దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్ సభ సెగ్మెంట్ మల్కాజ్ గిరి. ఈ ఒక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే 38 లక్షలు. దేశంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజిగిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్ గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ … Read more

హస్తం గూటికి మరో బిఆర్ఎస్ కౌన్సిలర్

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 16:హుజురాబాద్ లో గులాబీ పార్టీ నుండి మెల్లమెల్లగా ఒక్కొక్క లీడర్ జారుకుంటుంన్నారు.ఇప్పటికే పలువురు అధికారం లో ఉన్న నాయకులు బిఆర్ఎస్ పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరగా,తాజా గా జమ్మికుంట పట్టణానికి చెందిన కౌన్సిలర్ శ్రీపతి నరేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.హైదరాబాద్ లో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఓడితల ప్రణవ్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోని ఆహ్వానించారు.ఈ సందర్బంగా శ్రీపతి నరేష్ మాట్లాడుతూ తన చేరికకు సహకరించిన మంత్రి పొన్నం … Read more

ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి

కరీంనగర్ ఏప్రిల్08:ఉపాధిహామీ పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు,మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రోజున పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డి ఆర్ డి ఓ ఉప్పుల శ్రీధర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సృజన్ కుమార్ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశాల్లో ఉపాధిహామీ కూలీలకు … Read more

ఛలో తుక్కుగూడ సభ కి కదిలిన కాంగ్రెస్ శ్రేణులు

జమ్మికుంట ఏప్రిల్ 06:జమ్మికుంట మండలం నుండి చలో తుక్కుగూడ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జాతీయ మేనిఫెస్టో విడుదల సభకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో వీరవేని పరుశురాం, పర్లపల్లి నాగరాజు,రాచపల్లి సమ్మయ్య,సలిగంటి సతీష్,రాచపల్లి సాగర్, రాచపల్లి శ్రీనివాస్, నాగినేని రాజేశ్వర్ రావు,తాల్ల శ్రావణ్, కరట్లపల్లి శ్రీనివాస్,ఎరబాటి రమేష్ దోగ్గల భాస్కర్,రాచపల్లి శేఖర్, కొలుగురి సాయి,రాచపల్లి వంశీ,రాచపల్లి … Read more