ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్ రావు 93వ జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల రాజేశ్వర్ రావు విగ్రహానికి  వారి కుమారులు కిషన్ రావు,శ్రీనివాస రావు,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు,కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.పేదల పక్షాన నిలబడి వారికి కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశాడని,గల్లి నుండి ఢిల్లీ వరకు … Read more

యశ్వంత్ మృతి అత్యంత బాధాకరం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇంటర్ విద్యార్థి విద్యుద్ఘాతంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్ తెలిపారు. శనివారం ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనతో ఊరంతా విషాదచాయలు నెలకొన్నాయని పేర్కొన్నారు.ఈ దుర్ఘటనపైన చింతిస్తూ,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వెంకట్ తెలిపారు.ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాల్లో నవరాత్రుల కోసం మండపాల అలంకరణ,నిమజ్జనం సమయాల్లో నిర్వాహకులు తగు జాగ్రత్తలు … Read more

ప్రభుత్వ భూమి రక్షణకు కృషి చేయాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 629, 467,286 లో గల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే అని మాజీ జెడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ అన్నారు. గురువారం జమ్మికుంట తహసిల్దార్ కు ప్రభుత్వ భూములు రక్షించాలంటూ వినతి పత్రం సమర్పించిన మాజీ జెడ్పిటిసి శ్యామ్ మాట్లాడుతూ,గత ప్రభుత్వ హయాంలో అధికారుల అండదండలతో నాయకుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని ఆయన అన్నారు. అధికారులు సైతం … Read more

బి.సిల హక్కుల కోసం బి.సి న్యాయవాదులు ముందుండాలి

•హుజూరాబాద్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ హుజురాబాద్/ధనాధన్ న్యూస్: బి.సిల హక్కుల సాధన కోసం చట్టం,న్యాయం, రాజ్యాంగం తెలిసిన బి.సి న్యాయవాదులు ముందుండాలని ఐ ఎల్ పి ఎ రాష్ట్ర నాయకులు సాయిని నరేందర్ అన్నారు.బి.సి హక్కుల సాధన ఉద్యమంలో బి.సి న్యాయవాదులను భాగస్వాములను చేయడం కోసం ఈ నెల 25 న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న  తెలంగాణ రాష్ట్ర స్థాయి బి.సి న్యాయవాదుల సదస్సును పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్ … Read more

హుజురాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: రక్షా బంధన్ సందర్భంగా సమాజంలో సోదర భావం మరింత పెంపొందాలని,హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు.మహిళల రక్షణ పట్ల,మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించామని,ఉచిత బస్ సౌకర్యం ద్వారా అనేకమంది స్త్రీలు లబ్ధి పొందారని అన్నారు.అలాగే రాబోయే రోజుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల … Read more

సోదరభావం,పవిత్రతే రక్షాబంధన్ సందేశం

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెదలాలనే సందేశాన్ని తెలియజేయడమే రక్షాబంధన్ ఉద్దేశ్యమని బ్రహ్మకుమారీలు  కల్పన, శ్రీవాణి అన్నారు. శుక్రవారం రాఖీ పండగ విశిష్టతను వివరిస్తూ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ లో పలువురికి రాఖీలు కట్టారు. రాఖీ యొక్క విశిష్టతను తెలియజేస్తూ అక్కా చెల్లెలు, అన్నదమ్ముల బంధం గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడారు.సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో ప్రతి పండుగ పరమాత్ముని అవతరణ, దివ్య కర్తవ్యాన్ని సూచిస్తుందన్నారు. రక్షణ అంటే విలువలను పెంపొందించుకోవడం, … Read more

హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి నలుగురు డాక్టర్ల నియామకం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో వైద్యులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్ త్వరితగతిన వైద్యులను నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరగా స్పందించిన కలెక్టర్ ఏరియా హాస్పిటల్ కు నలుగురు వైద్యులు నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడించారు.హుజురాబాద్,జమ్మికుంట ఆసుపత్రులకు 15 లక్షల రూపాయలను వాటి అభివృద్ధి కొరకు కేటాయించేలా కృషి చేశారు.ఆసుపత్రులకు నిత్యం అనేకమంది రోగులు వస్తుంటారు,వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని … Read more

మానసిక దివ్యాంగ విద్యార్థులకు అండగా ఉంటా

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా పిల్లలు అల్లరి చేస్తే మనం విసుక్కుంటామని,అలాంటిది దివ్యాంగులైన పిల్లలకు విద్య నేర్పడం,కోచింగ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదని దాన్ని  నిర్వహిస్తున్న,శిక్షణ ఇస్తున్న సిబ్బంది గొప్ప మనసు గల వారిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని 8వ వార్డులో గల సాయి మానసిక దివ్యంగుల ప్రత్యేక పాఠశాలను ఆయన సందర్శించారు.పాఠశాలలో నూతనంగా నిర్మించినటువంటి వంటగదిని,పాఠశాలలో మరమ్మత్తు చేసిన ఇతర వాటిని ఆయన … Read more

సర్కార్ దవాఖానలో సౌలతులు ఏవి?

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వా ఆస్పత్రుల్లో ‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’’ అనే పరిస్థితి నెలకొంది.ఆస్పత్రుల్లో వైద్యులు సరిపడా కాదు కనీసంగా కూడా లేకపోవడంపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్, జమ్మికుంట మండలకేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయల,డాక్టర్‌ల కొరత ఉందని ఏడాది క్రితం నుంచి ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ చెప్తూనే ఉన్నారు. హుజూరాబాద్ … Read more

సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: ఈ నెల 18వ తారీఖున జరిగే సర్వాయి పాపన్న 374 వ జయంతి గ్రామ,గ్రామాన వాడవాడల ఘనంగా నిర్వహించాలని సర్వాయి పాపన్న కీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పూదరి విజయ్ పిలుపునిచ్చారు.జమ్మికుంట పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ముత్యం శంకర్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రాజమల్లు గౌడ్ పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ బడుగు,బలహీనుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న … Read more