డ్రోన్ స్పేయర్ కు యువకులకు రుణ సదుపాయం

సైదాపూర్ మండలంలోని వెన్కేపల్లి లో సోమవారం రోజున విశాల సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశంలో  అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించినట్లయితే రైతులకు ఆర్థిక భారం తగ్గి సంఘ అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారని, ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో డ్రోన్ స్పేయర్ అవసరం అవుతుంది గ్రామంలో రైతులు పండించే వరి మొక్కజొన్న పత్తి పంటలకు చీడపీడల నివారణ కోసం పిచికారి చేసేందుకు … Read more

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు జన్మదిన వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ అవరణలో బారాస అధ్యక్షులు సోమరపు రాజయ్య ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు జన్మదిన వేడుకలను మరియు మండలం కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి,ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కేక్ కట్ చేసిన తరువాత నాయకులూ కార్యకర్తలు స్వీట్ పంపిణి చేశారు.వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు.సతీష్ బాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని … Read more

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీ వొడితల రాజేశ్వర్ రావు 93వ జయంతి వేడుకలు హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల రాజేశ్వర్ రావు విగ్రహానికి  వారి కుమారులు కిషన్ రావు,శ్రీనివాస రావు,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు,కుటుంబసభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.పేదల పక్షాన నిలబడి వారికి కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేశాడని,గల్లి నుండి ఢిల్లీ వరకు … Read more

భవిష్యత్తు మున్నేరుపాలు..!!

ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఒకరు కాదు..ఇద్దరు కాదు..సుమారు 500 మంది విద్యార్థుల విద్యార్హతల సర్టిఫికెట్లు మున్నేరుపాలయ్యాయి.టెన్త్‌ మొదలు పీజీ వరకు పూర్తి చేసిన విద్యార్థులే కాక కొందరు ఉద్యోగాలు చేస్తున్న వారి సర్టిఫికెట్లు సైతం వరదలో కొట్టుకుపోయాయి.దీంతో వారంతా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.ఖమ్మం నగరం,ఖమ్మం రూరల్‌ మండలాన్ని మున్నేరు వరద ముంచెత్తగా 50 కాలనీల్లోకి నీరు చేరింది. అందులో కొన్ని ఇళ్లు కొట్టుకుపోగా..కొన్ని నేలమట్టమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున మున్నేరు వరద చుట్టుముట్టడంతో బాధితులు కట్టుబట్టలతో వెళ్లిపోయారు. వరద తగ్గాక … Read more

న్యాయం కోసం సహారా ఏజెంట్లు ఎదురుచూపు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తమకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సహారా ఇండియా ఏజెంట్లు,ఖాతాదారులు కోరారు. జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో మంగళవారం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వెంటనే తమ డిపాజిట్‌ సొమ్ము చెల్లించాలన్నారు. సహారా సంస్థలో కోట్లాది మంది పెట్టుబడులు పెట్టారని,సుప్రీంకోర్టు వడ్డీతో సహా బాధితులకు వారి డిపాజిట్‌ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమని విమర్శించారు. … Read more

విద్యార్థుల జుట్టు కట్ చేసిన ఉపాధ్యాయురాలు

ఖమ్మం/ధనాధన్ న్యూస్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ ప్రభుత్వ హైస్కూల్లో టీచర్ విద్యార్థుల జుట్టు కట్‌ చేయడం కలకలం రేపింది.దీంతో టీచర్ తీరును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు.టీచర్ కత్తిరించడంతో విద్యార్దులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.టీచర్ శిరీష అమానుషంగా ప్రవర్తించడం సరియైనది కాదని పేరెంట్స్ తో కలిసి ప్రధాన ఉపాధ్యాయుడు వద్ద ఆందోళన చేశారు.ప్రభుత్వ హై స్కూల్ లో 6,7,8,9,10 తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఇంగ్లీష్‌ టీచర్ కత్తెరతో … Read more

అక్బరుద్దీన్ ఓవైసీ కీ ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్: హైద‌రాబాద్ పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని,ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణ గుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లా డుతూ.. అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని వ్యాఖ్యానిం చారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి దగ్గరుండి నామినే షన్ వేయిస్తానని..గెలిపించి ఉపముఖ్యమంత్రిని చేస్తానన్నారు.కాగా,అంతకు ముందు … Read more

భార్యను చూడటానికి బస్సును ఎత్తుకెళ్ళిన భర్త

నందికొట్కూరు/ధనాధన్ న్యూస్: భార్యను చూడటానికి ఏకంగా ఏపిఎస్ ఆర్టీసి బస్సునే ఎత్తుకెళ్లాడు ఓ భర్త.బస్ దొంగతనం విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంటుందని,నా భార్యను చూసేందుకు వాహనాలేవి లేకపోవడంతో చూస్తున్న క్రమంలో బస్టాండ్ లో బస్సు ఉందని,తాళాలు బస్సుకే ఉండటంతో బస్సును తెచ్చుకున్నానని పోలీసులకు సమాధానం ఇచ్చాడు.ఈ సంఘటన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది..

నీళ్లు ఇవ్వకపోతే రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తా

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్పా రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు నీళ్లు అందగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి పంప్ హౌస్ వద్ద 17 పంపులు రెడీగా ఉన్నాయని వెంటనే … Read more

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండలకేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు సమావేశ మందిరంలో మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ దొడ్డే మమత ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్ ఎంపీపీ తిరుపతిరావు,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశంగా ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల కాలంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. ప్రజా ప్రతినిధులు … Read more