ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 14:సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా డా. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు కూడా పూలమాలలు సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రాల స్వతంత్ర మాట్లాడుతూ, చిన్ననాట కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ డా. … Read more

జాతీయ రోడ్డు భద్రత మనందరి బాధ్యత: సర్పంచ్ గుర్రాల స్వతంత్ర

సైదాపూర్/ధనాధన్ న్యూస్ ఏప్రిల్ 13:సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గుర్రాల స్వతంత్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాపాయానికి దారి తీస్తుందని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలను … Read more

వేసవి తీవ్రత నేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: పెరుగుతున్న వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని THR టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో సాధారణ ప్రజలు, కూలీలు, రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలకు ఉపశమనం కల్పించే విధంగా పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లు, మార్కెట్ ప్రాంతాలు, ఆసుపత్రులు వంటి జనసమ్మర్థం … Read more

హుజూరాబాద్‌లో డంప్ యార్డ్ ప్రతిపాదనపై మరోసారి చర్చ

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణ పరిధిలో ప్రతిపాదిత డంప్ యార్డ్ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డిని కలిసి ఈ విషయంపై మరొక్కసారి వినతి పత్రం అందజేశారు. సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయాలని భావిస్తున్న డంప్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానిక ప్రజలకు కలిగే ఇబ్బందులు, వ్యవసాయంపై పడే ప్రతికూల ప్రభావాలను … Read more

సిరిసేడు గ్రామంలో ప్రత్యేక గ్రామసభ… ప్రభుత్వ పథకాలపై అవగాహన

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్:ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ రేణికుంట్ల శ్యామల-కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆలపించారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని గ్రామస్తులకు ప్రదర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరై తమ శాఖలకు … Read more

3న హుజూరాబాద్ బంద్‌

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ సమీపంలోని సిర్సపల్లి గ్రామంలో ప్రతిపాదించిన వెస్ట్ టు ఎనర్జీ (WTE) డంపింగ్ యార్డు ప్రాజెక్టుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమలు వల్ల పరిసర ప్రాంతాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో గాలి, నీరు, ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. … Read more

సీనియర్ జర్నలిస్టు ఏబూసి శ్రీనివాస్‌కు నంది అవార్డు ప్రదానం

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏ. బూసి శ్రీనివాస్‌కు ప్రతిష్టాత్మకమైన తెలుగు వెలుగు జాతీయ ఉగాది పురస్కార్ – నంది అవార్డు ప్రదానం చేశారు. సామాజిక సేవ, పత్రికా రంగాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు.తెలుగు వెలుగు సాహితీ వేదిక (జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు వెలుగు జాతీయ ఉగాది సాహితీ–సాంస్కృతిక ఉత్సవాలు … Read more